వందేమాతరం ఉద్యమం | vandematar udyamam full story in Telugu | group-2 study materials download free

         వందేమాతరం ఉద్యమం

                                

వందేమాతరం ఉద్యమం

ఈ వందేమాతరం ఉద్యమం బెంగాల్ విభజన కారణంగా ప్రారంభించడం జరిగింది.

ఈ ఉద్యమం ఐదు దశల్లో ఉంటుంది.1896వ సంవత్సరంలో అస్సాం కమిషనర్ అయినా విలియం వార్డు బెంగాల్ ను రెండుగా విభజించడం వలన బెంగాల్ లో జాతీయ వారం తగ్గుతుందన్న ఆలోచనతో బెంగాల్ ను రెండుగా విభజించాలని ప్రకటన చేశాడు.

1905 జూన్ నెలలో గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ బెంగాల్ లో అతి పెద్ద రాష్ట్రం దీని యొక్క పరిపాలన సౌలభ్యం కొరకు దీన్ని రోడ్డు గా విభజించాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు.

1905 జులై నెలలో బెంగాల్ ను రెండుగా చీలి కలు చేస్తున్నారని ప్రజలకు తెలిసింది. ఈ సమయంలో బ్రిటిష్ వారు చేసిన ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ ఎన్ బెనర్జీ, కేకే mitra లు మొట్టమొదటిసారిగా పట్టారు. ఈ సమయంలోనే కేకే మిత్ర స్థాపించిన సంజీవిని పత్రికలో బాయ్ కాట్ అనే పదాన్ని వాడు.

1905 సెప్టెంబర్ నెలలో బెంగాల్ విభజనకు సంబంధించిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సుబ్రమణ్యం అయ్యర్ మద్రాస్ బీచ్ లో ఒక సమావేశాన్ని నిర్వహించాడు ఈ సమావేశంలో ముగ్గురు ప్రముఖులు పాల్గొన్నారు,1) కేరళ శ్రీరామమూర్తి,2) సుబ్రహ్మణ్య భారతి,3) సిహెచ్ సుబ్బారావు మరియు ఇతరులు పాల్గొన్నారు.

బ్రిటిష్ వారు ఈ ఉద్యమాలను ఏమాత్రం లెక్కచేయకుండా 1905 అక్టోబర్ 16 వ తేదీన బెంగాల్ విభజనను పూర్తిగా అమల్లోకి తీసుకువచ్చారు. 

దీని ప్రకారం బెంగాల్ ను తూర్పు మరియు పశ్చిమ బెంగాల్ లుగా చీలికలు చేశారు. తూర్పు బెంగాల్ యొక్క రాజధాని దాకా ప్రాంతంలో మరియు పశ్చిమ బెంగాల్ యొక్క రాజధాని కలకత్తాలో ఏర్పాటు చేశారు. అలాగే ఈస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ బాంబు ఫీల్డ్ పుల్లర్ మరియు వెస్ట్ బెంగాల్ యొక్క జనరల్ కర్జన్ లు నియామకం అయ్యారు.

1905 అక్టోబర్ 16 వ తేదీ బెంగాల్ లోని ప్రజలు బ్లాక్ డే గా జరుపుకుంటారు.

1905 అక్టోబర్ 16 వ తేదీన కలకత్తా టౌన్ హాల్ వద్ద ఒక సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు అధ్యక్షుడు ఆనంద మోహన్ అయితే ఆ సమయంలో ఇతనికి ఆరోగ్యం సరిగా ఉండక పోవడం వలన ఇతని యొక్క సందేశాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ చదివి వినిపించాడు( విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులు వాడాలని). అదేవిధంగా దేశ ప్రజలు స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలని ప్రతిజ్ఞను కూడా చేయించారు. అలాగే రక్షాబంధన్ ఉత్సవాలకు కూడా ఇక్కడే పిలుపునిచ్చారు.

ఈ విభజన సమయంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించాడు. ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ ప్రజలు ఈ గీతాన్ని తమ జాతీయ గీతంగా ఆలపిస్తున్నారు.

అయితే అప్పటి బెంగాల్ ప్రజలు బెంగాల్ విభజనను రద్దు చేయాలి అంటూ ఊరేగింపు లతో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించారు కానీ పెద్దగా ఫలితం లేకపోయింది.

1905 అక్టోబర్ నెలలో 22వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం కార్ల్ఇల్ సర్కులర్ ను జారీ చేశారు దీని ప్రకారం వందేమాతర ఉద్యమంలో ఎవరైతే విద్యార్థులు పాల్గొంటారు వారి యొక్క స్కాలర్షిప్లు రద్దు చేయబడతాయి అని అదేవిధంగా, ఆ విద్యార్థుల యొక్క గుర్తింపును కూడా రద్దు చేయబడతాయి అని ఈ సర్కులర్ ద్వారా జారీ చేశారు దీంతో విద్యార్థుల యొక్క బలం వెనక్కి తగ్గింది.

1905 డిసెంబర్ వరకు ఈ ఉద్యమం మితవాదుల చేతులలో ఉండేది, అయితే 1906 డిసెంబర్ నెల కు చేరుకునే సమయానికి ఈ ఉద్యమం మితవాదులు చేతినుండి అతివాదుల చేతుల్లోకి మారింది, అప్పుడే వీరు వందేమాతర గీతాన్ని ఆలపించేవారు, అయితే వీరిలో ఒకరు అయినా “అశ్విని కుమార్ దత్త ” అనే వ్యక్తి ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు పెట్టాడు


వందేమాతర గీతం:-

1882 వ సంవత్సరం లో దీని చంద్ర చటర్జీ రాసిన ఆనంద మటు గ్రంథంలో ఈ గీతం గురించి పేర్కొనడం జరిగింది. ఇది సంస్కృతంలో రాయబడింది. ఈ ఆనందమటు గ్రంథం లోనే సన్యాసి తిరుగుబాటు గురించి పేర్కొనడం జరిగింది, సన్యాసి తిరుగుబాటు నాయకుడు అయినా బావ సాగర్ భారతదేశం తన తల్లిగా పేర్కొంటూ పాడిన పాట నే వందేమాతరం. ఈ గీతము ఆంగ్లంలోకి అనువదించిన వాడు అరబిందో ఘోష్.


వందేమాతర ఉద్యమకాలంలో జరిగిన విప్లవాత్మక ఉద్యమాలు:-

1906లో కలకత్తా మరియు దాకా లలో అనుశీలన సమితి యొక్క విప్లవ సంస్థలు ఏర్పడ్డాయి.

కలకత్తాలో అనుశీలన సమితి ఏర్పాటు చేసిన వారు ఉపేంద్ర నాథ్ దత్తా, భరేంద్ర కుమార్ గోస్, ప్రమోద్ మిత్ర. ఈ సంస్థకు సంబంధించిన సభ్యులు 1906 సంవత్సరంలో బాంబు ఫీల్డ్  పై దాడి,1907 లో ఆండ్రూ ఫ్రీజర్ పై దాడి,1908 లో కింగ్స్ ఫర్డ్ పై దాడి జరిపారు. ఈ దాడులు జరగడం వలన అనుశీలన సమితి సభ్యులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏ విధంగా బ్రిటిష్ వారికి పట్టుబడ్డ అనుశీలన సమితి సభ్యులపై అలీపూర్ కుట్ర కేసు నమోదు చేశారు. ఈ అలీపూర్ కుట్రకేసులో ప్రధాన నిందితులుగా అరబిందోను మరియు  భరీ0ద్ర కుమార్ ను అరెస్టు చేశారు. వీరి తరపున సి ఆర్ దాస్ సమర్థవంతంగా వాదించి అరవింద్ ను విడుదల చేయించాడు, కానీ భరీ0ద్ర కు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష అమలు చేయడం జరిగింది.


ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమం:-

1906 డిసెంబర్ నెలలో కలకత్తాలో దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షతన ఐ ఎం సి సమావేశం జరిగింది, దీని తర్వాత ఆంధ్రాలో వందేమాతర ఉద్యమ వ్యాప్తికి చర్యలు తీసుకోబడతాయి,

ఆంధ్రాలో వందేమాతరం ఉద్యమాన్ని బాగా కృషి చేసిన వారు
1) మున్నూరు కృష్ణారావు
2) గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
3) మునగాల రాజా
అదేవిధంగా ఆంధ్రాలో వందేమాతర ఉద్యమం వ్యాప్తి కొరకు సహాయపడిన వార్తా పత్రికలు కృష్ణ పత్రిక, స్వరాజ్య పత్రిక, నవ యువ పత్రిక, ఆంధ్ర పత్రిక, ఆంధ్రభారతి, ఆంధ్ర కేసరి మొదలగునవి.


అదేవిధంగా వందేమాతరం ఉద్యమం వ్యక్తి కొరకు ప్రోత్సహించిన పుస్తకములు జపాన్ చరిత్ర, జపాన్ఈయం, వందేమాతరం నాటకం.


వందేమాతర ఉద్యమం కొరకు ఏర్పడిన సంస్థలు బాలభారతి సమితి, మహిళా సమితి, స్వదేశీ సమితి లీగ్, వందేమాతర రక్షణ లీగ్, యువజన స్వరాజ్య సమితి, లాలాలజపతిరాయ్ విద్య అభివృద్ధి సంఘం, జాతీయ పాఠశాల, జాతీయ కళాశాల ఏర్పడ్డాయి.


ఆంధ్రా లో బిపిన్ చంద్రపాల్ పర్యటన

1907 ఏప్రిల్ నెలలో ముట్నూరి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటన చేశాడు.
1) విజయనగరం ఇక్కడ సభ ఏర్పాటు చేసినది భూపతి రాజు, ఉత్తర కోస్తాలో మితవాదుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఇక్కడ ప్రముఖ మితవాద నాయకుడైన బియ్యం శర్మ చంద్రపాల్ సభకు వెళ్లకూడదని ప్రజలకు పిలుపునిచ్చాడు. దీంతో ఇక్కడ సభ విఫలం అయింది.
2) కాకినాడ ఇక్కడ సభ పూర్ణయ్య ఏర్పాటుచేశాడు. ఈ సభ పాక్షికంగా విజయం సాధించింది.
3) రాజమండ్రి ఇక్కడ సభ ఏర్పాటు చేసినది బాలభారతి సమితి సభ్యులు మరియు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. బిపిన్ చంద్రపాల్ ఇక్కడ సౌర ఇంటిలో బస చేశాడు. అదేవిధంగా రాజమండ్రిలో జాతీయ పాఠశాలకు ధన సహాయం చేసిన వాడు కరణం గుణేశ్వర రావు, స్థలం దానం చేసినది పేరాజు.
4) విజయవాడ ఇక్కడ సభ ఏర్పాటు చేసినది మునగాల రాజా. అదేవిధంగా ఈయన విజయవాడలో స్వదేశీ వస్తువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
5) మచిలీపట్నం ఇక్కడ సభ ఏర్పాటు చేసింది రాందాస్ నాయుడు మరియు పురాణం వెంకయ్య, బిపిన్ చంద్రపాల్ రాందాస్ ఇంట్లో బస చేశాడు.

వందేమాతర ఉద్యమకాలంలో జరిగిన నాలుగు ప్రముఖ సంఘటనలు:-

రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్ సంఘటన:-
రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీ లో ప్రిన్సిపాలు మార్క హంటర్, అదేవిధంగా స్టూడెంట్ యొక్క లీడరు రామచంద్ర రావు, టీచరు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. అయితే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన స్టూడెంట్స్ బ్యాడ్జీలు కట్టుకొని వందేమాతరం అని అరుస్తూ ఉంటారు. దీంతో బ్రిటిష్ వారికి కోపం వచ్చి అక్కడ స్టూడెంట్ను మరియు టీచర్లను సస్పెండ్ చేస్తారు.

కాకినాడ సంఘటన:-

ఇక్కడ డాక్టర్ కెంపు మరియు గోదావరి కలెక్టర్ కమింగ్, పిఠాపురం యొక్క ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం. అయితే హరిపిరాల లక్ష్మయ్య డాక్టర్ కేంద్రంపై దాడి చేయడం వలన తన జైలు శిక్ష పడింది.


కోటప్పకొండ సంఘటన:-

కోటప్ప కొండ పైన జరిగే జాతరకు చేబ్రోలు నుండి చిన్నపరెడ్డి వస్తాడు. అయితే ఇక్కడ పోలీసులు జరిపిన దాడిలో చిన్నపరెడ్డి ఎదుకు దెబ్బ తగలడం వలన ఈయన పోలీసులపై దాడి చేస్తాడు. దీంతో అక్కడి పోలీసులు చెన్నప్ప రెడ్డిని దారుణంగా కొడతారు ఈ సమయంలో చిన్నపరెడ్డి వందేమాతరం అంటూ అరుస్తాడు దీంతో అక్కడ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంది. పోలీస్స్టేషన్ ఆఫీసర్ సుబ్బారావు మరియు ఎమ్మార్వో బ్రహ్మేంద్ర నాయుడు లాఠీచార్జి జరపగా నలుగురు వ్యక్తులు చనిపోతారు. వందేమాతర ఉద్యమకాలంలో మొట్టమొదటగా ఉరితీయబడిన వ్యక్తి చిన్నపరెడ్డి.

తెనాలి బాంబు కేసు:-

ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న వారు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య మరియు వెంకటరాయుడు. వీరు తరపున వాదించిన లాయర్ టంగుటూరి ప్రకాశం పంతులు ఈయన సమర్థవంతంగా వాదించి వీరు ముగ్గురు నీ విడుదల చూపిస్తాడు.

వందేమాతరం ఉద్యమం ముగింపు:-

1911 సంవత్సరం డిసెంబర్ నెలలో హార్డింగ్-2 ఢిల్లీ దర్బారులో ఘనంగా నిర్వహిస్తాడు. ఈ సభలో జార్జ్-5 ఈ క్రింది ప్రకటనలు చేస్తాడు
1) కలకత్తా నుండి ఢిల్లీకి మార్చుట.
2) బెంగాల్ విభజన రద్దు చేయుట.
జార్జ్ బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వందేమాతరం ఉద్యమం అనేది అంతం అయ్యింది. బెంగాల్ విభజన రద్దు తర్వాత బెంగాల్ గవర్నర్ గా చార్లెస్ నియామకం అయ్యాడు. తరువాత బెంగాల్ రాష్ట్రాన్ని మొత్తం మూడు రాష్ట్రాలుగా విభజన చేశారు 1)బెంగాల్ 2) అస్సాం 3) బీహార్

ఈ విధంగా వందేమాతరం ఉద్యమం అనేది వివిధ దశలలో జరిగి 1911వ సంవత్సరంలో నీ వందేమాతర ఉద్యమం అనేది అంతమయింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు