ఎవరైతే విద్యార్థులు ఒకటవ తరగతి నుండి 10తరగతి వరకు చదువుతున్న గవర్నమెంట్ మరియు ప్రవేట్ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత "BUS PASS" అందజేయడం జరుగుతోంది.
విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఫ్రీ BUSS PASS పథకాన్ని జూన్ 12వ తేదీ విడుదల చేయడం జరిగింది.
13వ తేదీ నుండి అప్లై చేసుకునే దానికి అవకాశం కల్పించింది.
విద్యార్థులు ఫ్రీ బస్సు పాస్ కొరకు కావలసిన డాక్యుమెంట్లు:-
👉 స్టూడెంట్ ఆధార్ కార్డు
👉 స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
👉 విద్యార్థి స్టడీ సర్టిఫికెట్
👉 స్కూల్ హెడ్మాస్టర్ సిగ్నేచర్ కలిగిన పత్రం
👉 స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్
👉 స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల ఫోన్ నెంబర్
ఈ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు మీ దగ్గరలోని ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి బస్సు పాస్ కు సంబంధించిన పత్రాలను వారికి సమర్పించండి.
ఆ తరువాత మీ యొక్క బస్సు పాస్ ను అప్లై చేస్తారు.
మీ బస్సు పాస్ అప్లై చేసిన తర్వాత రావటానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది.
ఈ స్టూడెంట్ బస్సు పాస్ పథకం పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు మీ స్కూల్ కు సంబంధించిన పత్రాలు మరియు హెడ్ మాస్టర్ యొక్క అనుమతి ఉంటే సరిపోతుంది.
విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.
జై హింద్ జై భారత్
0 కామెంట్లు